న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: భారత్లో బ్రిటిష్ నూతన హైకమిషనర్గా లిండీ కామెరాన్ నియమితులయ్యారు. ఈ పదవి చేపట్టిన తొలి మహిళ ఆమే కావడం గమనార్హం. ఇండియా 1954లో తన మొదటి హై కమిషనర్గా విజయలక్ష్మీ పండిట్ను లండన్కు పంపిన 70 ఏండ్ల తర్వాత ఈ చారిత్రాత్మక నియామకం జరిగింది. విజయలక్ష్మీ పండిట్ భారత్ తొలి ప్రధాని నెహ్రూకు స్వయాన సోదరి. ఆమె 1961 వరకు లండన్లో హై కమిషనర్గా పనిచేశారు. లిండీ కామెరాన్ ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి పట్టా పొందిన ప్రతిభాశాలి. గతంలో ఆమె యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్కు సీఈవోగా పనిచేశారు.