Report | ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రధాన కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దాంతో మానవ జీవితానికి పెను ముప్పుగా మారుతున్నది. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులతో సహా దక్షిణాసియాలోని ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో ప్రమాదకమైన ప్రభావాలు కనిస్తాయని తాజాగా ఓ నివేదిక తెలిపింది. మానవజన్య కార్యకలాపాలు, వాతావరణ మార్పులను సుమారు బిలియన్ జనం తీవ్రమైన పరిణామాలను అనుభవించాల్సి వస్తుందని పేర్కొంది. మూడు నదులపై నదీ పరీవాహక నిర్వహణకు వాతావరణ స్థితిస్థాపక విధానాన్ని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైవాటర్ రివర్ బేసిన్ గవర్నెన్స్ అండ్ కోఆపరేషన్ ఇన్ హెచ్ కేహెచ్ రీజియన్ పేర్కొంది. హిందూ కుష్ హిమాలయాలు (HKH) దక్షిణాసియా, ఆగ్నేయాసియాలోని పలు ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. మంచు, హిమనీనదాలు, వర్షాపాతం ద్వారా నీరు ఆసియాలోని పది పెద్ద నదులను నింపుతున్నది.
గంగానదికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ప్రస్తుతం పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు పలు అంశాలు నదిని దెబ్బతీస్తున్నాయి. మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలన్నీ నీటిని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి సైతం ప్రమాదం కలిగిస్తుందని నివేదిక పేర్కొంది. మానవజన్య కార్యకలాపాలతో పాటు, వాతావరణ మార్పుల ప్రభావాలు ప్రస్తుత సవాళ్లను.. ముఖ్యంగా వరదలు, కరువుల రూపంలో మరింత తీవ్రతరం చేస్తున్నాయని పేర్కొంది. జలవనరుల పునరుద్ధరణకు కీలకమైన వర్షాకాలంలో వరదలు ముంచెత్తుతుండగా.. బంగ్లాదేశ్ తదితర లోతట్టు ప్రాంతాలో ఎండాకాలంలో తీవ్రమైన నీటి ఎద్దడిని కలిగిస్తున్నది. ఈ పరిస్థితులు మహిళలు, వికలాంగులు, అణగారిన వర్గాలతో సహా బలహీన వర్గాలను అసమానంగా ప్రభావితం చేస్తాయని నివేదిక పేర్కొంది.
సింధు నది పాక్, భారత్, ఆఫ్ఘనిస్తాన్, చైనాలోని 268 మిలియన్ల మంది ప్రజలకు జీవనాధారం. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రస్తుతం నది స్వరూపం మారుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రుతుపవనాల సీజన్ సరిగా లేకపోవడంతో నీటి సంక్షోభం ఎదురవుతున్నది. ఇండస్ బేసిన్లో వాతావరణ మార్పుల ప్రభావం ఆహార భద్రత, జీవనోపాధి, నీటి భద్రతను దెబ్బతీస్తుందని నివేదిక తెలిపింది. రుతుపవన వర్షాల సమయం, వైవిధ్యం ఇప్పటికే బేసిన్లో స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హిమనదీయ ద్రవీభవన రేటు పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ఇది ప్రాంతం అంతటా నీటి లభ్యతను ప్రభావితం చేస్తుంది. బేసిన్లో ప్రస్తుతం పెద్దగా నీటి మళ్లింపులు ఏమీ లేవని, అయితే అప్స్ట్రీమ్ డ్యామ్ నిర్మాణం, వాతావరణ మార్పుల అంచనాలు ఎండాకాలం దిగువ ప్రాంతాలకు ప్రవాహాలను తగ్గిస్తాయని.. మిలియన్ల మంది జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వివరించింది.