చండీగఢ్: డేరా సచ్ఛా సౌధా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో ఆ సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు హర్యానాలోని పంచకులలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో నలుగురికీ ఇదే శిక్ష వేసింది. గుర్మీత్కు రూ.31 లక్షలు, మిగతా వారికి రూ.50 వేల జరిమానా విధించింది. రంజిత్ హత్య 2002లో జరిగింది. డేరాలో గుర్మీత్ మహిళలను ఎలా వేధిస్తున్నారన్నదానిపై అప్పట్లో ఓ లేఖ బయటకు వచ్చింది. దీంట్లో రంజిత్ పాత్ర ఉన్నదని అనుమానంతో ఆయనను గుర్మీత్ హత్య చేయించారు.