విద్యానగర్, ఏప్రిల్ 8: ప్రపంచవ్యాప్తంగా నాసా నిర్వహించే స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్లో కామారెడ్డి జిల్లాకు చెందిన హితార్ద్ అనే విద్యార్థి రూపొందించిన ఎల్పిస్ అనే ప్రాజెక్ట్ హానరబుల్ మెన్షన్కు ఎంపికైంది. హితార్ద్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 160 ప్రాజెక్టులు ఈ కాంటెస్ట్లో పాల్గొన్నాయి. అందులో కామారెడ్డికి చెందిన హితార్ద్కు చోటుదక్కింది. నాసా ప్రాజెక్ట్లో స్థానం సంపాదించడంపై విద్యార్థి తండ్రి నవీన్ ఆనందం వ్యక్తం చేశారు.