కోల్కతా, సెప్టెంబర్ 10: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తాను హెచ్చరించిన విధంగానే రాష్ట్రప్రభుత్వంపై మరో కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి ఆయన రెండు రహస్య లేఖలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.
అయితే ఆ లేఖల్లో ఏమున్నదన్న సంగతి అటు రాజ్భవన్ గానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ వెల్లడించ లేదు. ఈ లేఖల సారాంశం ఏమిటన్నది త్వరలోనే తెలుస్తుందని రాజ్భవన్ వర్గాలు పేర్కొన్నాయి.