భువనేశ్వర్: జూ నుంచి తప్పించుకున్న చిరుత పిల్ల (leopard cub) ఎట్టకేలకు దొరికింది. మధ్యప్రదేశ్లోని నవరతన్బాఘ్లోని అటవీ ప్రాంతంలో గాయాలతో బాధపడుతున్న ఆరు నెలల చిరుత పులిని అటవీ అధికారులు నవంబర్ 30న రక్షించారు. డిసెంబర్ 1న దానిని చికిత్సకోసం ఇండోర్లోని కమలా నెహ్రూ జూపార్క్కు తరలించారు. అయితే చీకటిపడటంతో జూలోని పార్కింగ్ ప్రాంతంలో చిరుత బోనును ఉంచారు. తెల్లారిన తర్వాత జూలో వదలడానికి జూ అధికారులు చూడగా అది అక్కడి నుంచి తప్పించుకుపోయింది. దీంతో గత గురువారం నుంచి దాని ఆచూకీ కోసం వెతుకున్నారు. గాయాలతో బాధపడున్న ఆ చిట్టి చిరుతను ఆరు రోజుల తర్వాత పట్టుకున్నారు.
కాగా, చిరుతపులి నవ్రతన్ బాఘ్లో ప్రాంతంలో తిరుగుతున్నదనే సమాచారం జూ సిబ్బందికి అందింది. దీంతో వలవేసి దానిని పట్టుకున్నామని జూ ఇన్చార్జీ ఉత్తమ్ యాదవ్ తెలిపారు. చిరుత కోసం ఆరు రోజులుగా వెతుకున్నామని ఎట్టకేలకు అది తమకు చిక్కిందని చెప్పారు. దానికి అవసరమైన చికిత్స చేసి మళ్లీ అటవిలో వదిలేస్తామని తెలిపారు.