న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష రంగంలో ఘన కీర్తి సాధించిన ఇస్రోను ఐస్లాండ్ అవార్డు వరించింది. విజయవంతంగా చంద్రయాన్-3 మిషన్ను చేపట్టినందుకు గాను హుసావిక్ నగరంలోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ‘లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్-2023’ను ప్రకటించింది. చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా నిలిచిన భారత్ను ఈ అవార్డు వరించడం సంతోషకరమని ఐస్లాండ్లో భారత రాయబార కార్యాలయం పేర్కొన్నది. అవార్డును ఇస్రో తరపున రాయబారి బీ శ్యామ్ అందుకొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మెన్ ఎస్ సోమనాథ్ నిర్వాహకులకు ధన్యవాదాల సందేశం పంపారు. కొలంబస్ అన్వేష యాత్ర కంటే నాలుగు శతాబ్దాల ముందుగానే అమెరికా భూభాగంపై అడుగుపెట్టిన మొదటి యూరోపియన్గా భావిస్తున్న లీఫ్ ఎరిక్సన్ పేరు మీదుగా ఈ అవార్డును అందజేస్తున్నారు.