న్యూఢిల్లీ : 5జీ కేసులో నటి జూహీచావ్లాను సమస్యలు వెంటాడుతున్నాయి. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జుహీచావ్లాకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. డీఎస్ఎల్ఎస్ఏ పిటిషన్ను వచ్చే నెల 3న కోర్టు విచారించనున్నది. 5జీ టెక్నాలజీ ప్రవేశపెట్టడం ద్వారా మనుషుల నుంచి పశు పక్షాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గతంలో కోర్టులు బాలీవుడ్ నటి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ పిటిషన్ను సింగిల్ బెంచ్ పిటిషన్ను కొట్టివేసి.. రూ.20లక్షల జరిమానా విధించింది.
ఈ నేపథ్యంలో ఆదేశాలను అమలు చేయాలని, లేదంటే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జుహీ చావ్లా సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై చేసిన అప్పీల్ డివిజన్ బెంచ్ ఎదుట పెండింగ్లో ఉందని ఆమె తరఫు న్యాయవాది అమిత్ బన్సల్ పేర్కొన్నారు. అయితే లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున న్యాయవాది సౌరభ్ కన్సల్ జుహీ నుంచి జరిమానా వసూలు చేయాలనే ఉత్తర్వులు జూన్లో జారీ అయ్యిందని, ఇంకా అమలు కాలేదని తెలిపారు.
డీఎస్ఎల్ఎస్ఎ ద్వారా రికవరీకి నోటీసు అందించిన తర్వాతే ఆర్డర్పై అప్పీల్ దాఖలు చేశామని, డివిజన్ బెంచ్ ఎలాంటి స్టే ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై జూహీచావ్లాతో పాటు పలువురి తరఫున న్యాయవాది దీపక్ కోస్లా మాట్లాడుతూ జరిమానా విధించే హక్కు సింగిల్ జడ్జి (సింగిల్ బెంచ్)కు లేదని వాదించారు. అయితే లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున న్యాయవాదులు సౌరభ్ కన్సల్, పల్లవి ఎస్ కన్సాల్ జరిమానా రికవరీ కోసం చర, స్థిరాస్తులను అటాచ్మెంట్ కోసం వారెంట్ జారీ చేయాలని, లేదంటే జైలు శిక్ష విధించాలని కోర్టును కోరారు.