జైపూర్ : రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణి సేన (Karni Sena) అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ను జైపూర్లోని ఆయన నివాసంలో మంగళవారం కొందరు దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న గార్డ్ అజిత్ సింగ్ దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న అజిత్ సింగ్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది.
సుఖ్దేవ్ సింగ్పై కాల్పుల ఘటనకు తామే బాధ్యులమని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు రోహిత్ గొదారా ప్రకటించారు. కర్ణి సేన చీఫ్ హత్యకు తమ గ్యాంగ్దే పూర్తి బాధ్యతని రోహిత్ గొదారా ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు. కాగా, రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేది మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
జైపూర్లోని తన నివాసంలో ఇద్దరు అనుచరులతో కలిసి ఉన్న సుఖ్దేవ్ సింగ్పై బైకు మీద వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. మాట్లాడుతున్నట్లుగా నమ్మించి సడెన్గా దాడిచేశారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుఖ్దేవ్ను కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read More :