పాట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) కీలక నేత, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ పెండ్లి చేసుకోబోతున్నారు. గురువారం ఢిల్లీలో నిశ్చితార్థం జరుగనున్నది. అయితే పెండ్లి కూతురు ఎవరు? ఎక్కడ ఉంటారు? అన్న విషయాలు వెల్లడికాలేదు. బహుశా ఈ నెలలోనే పెండ్లి జరుగనున్నట్టు తెలుస్తున్నది. తమ ప్రియతమ నేత పెండ్లి పీటలు ఎక్కబోతున్నారన్న విషయం తెలిసిన కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకుంటూ ఆనందంలో మునిగిపోయారు.