పాట్నా: బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్కు తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) అన్నారు. మహాకూటమిలోకి తిరిగి వస్తే పరిశీలిస్తామని చెప్పారు. లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ‘అబ్ ఆయేంగే తో దేఖ్లేంగే (ఆయన తిరిగి వస్తే అప్పుడు చూద్దాం). ఖులా హీ రెహతా హై దర్వాజా (తలుపు తెరిచే ఉంది)’ అని అన్నారు.
కాగా, రాజ్యసభకు ఆర్జేడీ అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా గురువారం భార్య, కుమారులతో కలిసి
అసెంబ్లీకి వెళ్లిన లాలూకు సీఎం నితీశ్ కుమార్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన లాలూ భుజం తట్టి
అప్యాయంగా పలకరించారు. రబ్రీదేవికి కూడా నితీశ్ మర్యాదపూర్వకంగా నమస్కరించారు. ఈ సంఘటన
తర్వాత నితీశ్కు తలుపులు తెరిచే ఉన్నాయని లాలూ వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
గత నెలలో మహాకూటమి ప్రభుత్వం నుంచి వైదొలగిన నితీశ్ కుమార్ తిరిగి బీజేపీతో జతకట్టారు. మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఎన్డీయే మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే నితీశ్ కుమార్ ఇప్పటి వరకు ఆరుసార్లు మహాకూటమి, ఎన్డీయే కూటములకు మారారు. 2013లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్నారు. బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
మరోవైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2022లో ఎన్డీయే ప్రభుత్వాన్ని నితీశ్ కుమార్ వీడారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏడాది జనవరిలో అనూహ్యంగా తిరిగి ఎన్డీయేతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై శాశ్వతంగా ఎన్డీయేతోనే ఉంటానని నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.
#WATCH | Patna: On giving a chance to Nitish Kumar again, former Bihar CM and RJD chief Lalu Prasad Yadav says “…’Ab aayenge toh dekhenge, khula hi rehta hai darwaaza’…” pic.twitter.com/seY1oWV2pp
— ANI (@ANI) February 16, 2024