న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: తమ ముందు మోకరిల్లడానికి సిద్ధంగా లేని వారిని బీజేపీ రాజకీయంగా ఏదో విధంగా వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇలాంటి రాజకీయాల వల్లే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లారని పేర్కొన్నారు. త్వరలోనే ఆయనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. లాలూకు మద్దతు తెలిపినందుకు ప్రియాంకకు తేజస్వీ కృతజ్ఞతలు తెలిపారు.