Lalu- Modi |రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ (74) ఆరోగ్య పరిస్థితి గురించి ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ఆరా తీశారు. ఆదివారం పాట్నాలోని తన ఇంట్లో కింద పడిపోవడంతో భుజానికి గాయమై దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో లాలూ ఆరోగ్యం గురించి ఆయన తనయుడు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు ప్రధాని మోదీ ఫోన్ చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఈ విషయమై ఆర్జేడీ అధికార ప్రతినిధి చిత్తరంజన్ గగన్ మంగళవారం ప్రకటన చేశారు. `ఆర్జేడీ అధినేత లాలూ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్రమోదీ.. లాలూ తనయుడు తేజస్వి యాదవ్తో వాకబు చేశారు. త్వరితగతిన లాలూ కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు` అని తెలిపారు. ప్రస్తుతం పాట్నాలోని ఓ దవాఖానలో లాలూ చికిత్స పొందుతున్నారు. పలువురు వైద్యుల బృందం.. లాలూ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నదని చిత్తరంజన్ గగన్ తెలిపారు.