ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం విషమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను రాంచీ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్కు చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స అందించి, అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఆయన్ను డిచ్చార్జీ చేశారు. దాని తర్వాత అంత వైద్యుల పర్యవేక్షణలోనే వున్నారు. అంతా సెట్ అయిపోయిందని అనుకున్న సమయంలో మళ్లీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన్ను ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. దీంతో కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
రాత్రంతా లాలూ ప్రసాద్ వైద్యుల పర్యవేక్షణలోనే వున్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన్ను ఉదయం 3 గంటల ప్రాంతంలో డిశ్చార్జీ చేశాం. మళ్లీ ఆరోగ్యం ఇబ్బందిపడటంతో ఆయన్ను బుధవారం మధ్యాహ్నమే ఎమర్జెన్సీ వార్డుకు తరలించాం అని వైద్యులు ప్రకటించారు.
రాంచీలో లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమించింది. దీంతో అక్కడి రిమ్స్ వైద్యులు ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించాలని సూచించారు. దీంతో ఆయన్ను మంగళవారం అర్ధరాత్రి ఎయిమ్స్కు తీసుకొచ్చారు. వైద్యం అందించారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన్ను డిశ్చార్జీ చేశారు. మళ్లీ ఇబ్బందులు రావడంతో ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు.