లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనకు సంబంధించిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను స్థానిక కోర్టు తోసిపుచ్చింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రాతో సహా 14 మందిపై హత్య కేసు నమోదు చేయాలని కోరుతూ లఖింపూర్ హింసలో చనిపోయిన జర్నలిస్టు సోదరుడు ఈ పిటిషన్ను కోర్టులో దాఖలు చేశారు.
ఈ హింసాత్మక ఘటనపై ఇప్పటికే పలు పిటషన్లను విచారణ చేస్తున్న కోర్టు విడిగా మరొక పిటిషన్ అవసరంలేదని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్ ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి ప్రాంతంలో అక్టోబర్ 3న జరిగిన హింసలో నలుగురు రైతులు, ఒక పాత్రికేయుడితో సహా 8 మంది చనిపోయిన విషయం తెలిసిందే.