Lakhimpur Kheri | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశీష్ మిశ్రా టేనీని శనివారం ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతవారం యూపీలోని లఖీంపూర్ హింస కేసులో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో సహకరించడం లేదన్న అభియోగంపై ఆయన్ను అరెస్ట్ చేశారని సమాచారం.
ఆశీష్ మిశ్రాను అరెస్ట్ చేయడానికి ముందు ఆయనను శనివారం లఖీంపూర్ ఖేరిలోని క్రైంబ్రాంచ్ ఆఫీసులో పోలీసులు ప్రశ్నించారు. ఆయన ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సహరాన్పూర్ డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పడం లేదు.. విచారణకు సహకరించనందు వల్లే అరెస్ట్ చేశాం. ఆయనను కోర్టులో ప్రవేశపెడతాం అని చెప్పారు.
అక్టోబర్ మూడో తేదీ మధ్యాహ్నం 2.36 గంటల నుంచి 3.30 గంటల వరకు ఆయన ఎక్కడ ఉన్నారో తెలిపే ఆధారాలు సమర్పించలేదని అధికార వర్గాల కథనం. అయితే, లఖీంపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతుల మీదకు కారు నడిపించినప్పుడు అందులో ఆశీష్ మిశ్రా లేరని పేర్కొంటూ 10 మంది సంతకాలు చేసిన అఫిడవిట్లను, వీడియోలను పోలీసులకు సమర్పించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఎంపీఎస్ పరిమితి 5 లక్షలకు పెంపు
Offline Digital Payments | త్వరలో ఆఫ్లైన్ డిజిటల్ పేమెంట్స్
US trillion dollar coin | అమెరికా ఖజానా ఖాళీ.. ఆ ఒక్క నాణెం అగ్ర రాజ్యాన్ని రక్షిస్తుందా?
Guinness Record : రెండు చక్రాలపై మూడు చక్రాల బండి.. చెన్నై వాసి గిన్నీస్ రికార్డ్