కేంద్రీయ విద్యాలయాల్లో 2022-2023 విద్యాసంవత్సరం ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు తేదీని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) పొడిగించింది. ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఏప్రిల్ 9, 2022న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం తుది గడువు ఏప్రిల్ 11 వతేదీ వరకు ఉండగా, ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు మరో రెండు రోజులు పొడిగించింది. ఇప్పటివరకూ దరఖాస్తు చేయని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కేవీఎస్ అధికారిక వెబ్సైట్ http://kvsonlineadmission.kvs.gov.inలో దరఖాస్తు చేయవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలంటే?
1. అధికారిక వెబ్సైట్ http://kvsonlineadmission.kvs.gov.inను ఓపెన్ చేయాలి.
2. హోమ్పేజీలో కనిపించే రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయాలి.
3. రిజిస్ట్రేషన్ చేశాక, అడ్మిన్ అప్లికేషన్ పోర్టల్కి లాగిన్ అవ్వాలి.
4. అప్లికేషన్ ఫాం నింపాలి
5. అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేసి, సబ్మిట్ చేయాలి.
6. దరఖాస్తు ఫాంను డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.