న్యూఢిల్లీ : సినీ రచయిత, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. విజయేంద్ర ప్రసాద్ చేత ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి కోటాలో విజయేంద్ర రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే.
ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంట్ ఆవరణలో విజయేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాజ్యసభకు వస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదు. తన కథలే తనను రాజ్యసభకు తీసుకొచ్చాయి. రాజ్యసభకు నామినేట్ కావడం తన బాధ్యతను మరింత పెంచింది. ప్రజా సమస్యలను రాజ్యసభ దృష్టికి తీసుకెళ్తాను అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.