పాట్నా, ఫిబ్రవరి 18: బీహార్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఈ కొత్త పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్తో విడిపోయాక ఉపేంద్ర కొత్త పార్టీని స్థాపించారు. పార్టీ పేరును రాష్ట్రీయ లోక్ మంచ్ అని వెల్లడించారు. తొలుత తాము రాష్ట్రీయ లోక్ జనతాదళ్ అనే పేరును సూచించామని, అయితే ఎన్నికల సంఘం మరికొన్ని పేర్లు సూచించాలని కోరిందని, చివరగా రాష్ట్రీయ లోక్ మంచ్ పేరు ఖరారు చేసిందని ఉపేంద్ర వెల్లడించారు.