Kulgam Encounter | దక్షిణ కశ్మీర్ కుల్గామ్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతున్నది. కుల్గామ్లోని కుజ్జర్ ప్రాంతంలో మధ్య కాల్పులు జరుగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మరోవైపు, జమ్మూ డివిజన్లోని రాజోరి జిల్లాలో భద్రతా బలగాల ఆపరేషన్ బుధవారం మూడో రోజు కొనసాగుతోంది. ఉగ్రవాదులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోయినప్పటికీ.. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. అటవీ ప్రాంతంలో బలగాలు జల్లెడపడుతున్నారు. సోమవారం నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. మంగళవారం ఉగ్రవాదుల ఆచూకీని తెలుసుకునేందుకు డ్రోన్లతో పాటు హెలికాప్టర్లను మోహరించారు.
సంఘటనా స్థలంలో బలగాల సంఖ్యను మరింత పెంచారు. ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దు పారా కమాండోలు సహా ముగ్గురు సైనికులకు గాయపడ్డారు. మంగళవారం మాత్రం కాల్పులు జరుగలేదు. అయితే, ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో రోజంతా అడవిలో గాలించినా ఆచూకీ మాత్రం దొరకలేదు. ఇద్దరు, ముగ్గురు ఉగ్రవాదులను దాక్కొని ఉంటారని భావిస్తున్నారు. తప్పించకోకుండా అన్ని మార్గాలను దిగ్బంధించేందుకు అదనంగా బలగాలను పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.