Loksabha Elections 2024 : కర్నాటక కాషాయ పార్టీలో విభేదాలు తీవ్రమయ్యాయి. లోక్సభ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్ధుల జాబితాపై ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. తన కుమారుడికి టికెట్ రాకుండా అడ్డుకున్న మాజీ సీఎం బీఎస్ యడియూరప్పపై సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప గుర్రుగా ఉన్నారు.
యడియూరప్పపై కోపంతో శివమొగ్గలో ఆయన కుమారుడిపై ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు ఈశ్వరప్ప సిద్ధమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నచ్చచెప్పినా పోటీ నుంచి వైదొలగేందుకు ఆయన ససేమిరా అంటుండటం కాషాయ పార్టీలో కలకలం రేపుతోంది. హవేరి స్ధానం నుంచి తన కుమారుడు కేఈ కంటేష్కు టికెట్ దక్కకుండా యడియూరప్ప అడ్డుకున్నారని ఈశ్వరప్ప కినుక వహించారు9. 2009 నుంచి యడియూరప్ప ఆయన కుమారుడు బీవై రాఘవేంద్ర శివమొగ్గ నియోజకవర్గం నుంచి గెలుపొందుతున్నారు.
ఇక ఈసారి ఈశ్వరప్పతో పాటు కాంగ్రెస్ అభ్యర్ధి శివరాజ్కుమార్ నుంచి బీవై రాఘవేంద్రకు పోటీ ఎదురవనుంది. కురుబ సామాజికవర్గానికి చెందిన ఈశ్వరప్ప శివమొగ్గ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు గెలుపొందడం గమనార్హం. తాను ఎన్నికల రాజకీయాల నుంచి వైదొలగుతానని గతంలో ప్రకటించిన ఈశ్వరప్ప తన కుమారుడికి బీజేపీ టికెట్ నిరాకరించడంతో తన మనసు మార్చుకున్నారు. గత నెల 18న శివమొగ్గలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి సైతం ఈశ్వరప్ప దూరంగా ఉన్నారు.
Read More :
KTR | ఫోన్ ట్యాపింగ్లో నాపై ఆరోపణలు చేసినవారికి నోటీసులు: కేటీఆర్