కోటా: రాజస్థాన్లోని కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి చెందిన రిచా సిన్హా నీట్ కోచింగ్ కోసం కోటాలోని ఓ ఇన్స్టిట్యూట్లో చేరింది. అయితే మంగళవారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరేసుకున్నది. గుర్తించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 23 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.