లక్నో : తల్లితండ్రులతో కలిసి తాజ్ మహల్ను సందర్శించిన కొరియన్ మహిళపై నెటిజన్లు (Viral Post) ప్రశంసలు గుప్పించారు. సోషల్ మీడియా ఇన్ప్లుయన్సర్ జివోన్కు భారత్తో పాటు దేశీ వంటకాలు ఎంతో ఇష్టం. దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించే జివోన్ ఆయా ప్రాంతాల్లోని భారతీయ రుచులను ఆస్వాదించే ఫొటోలు, వీడియోలను జివోన్ తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.
బాలీవుడ్ సాంగ్స్కు హుషారైన స్టెప్స్తో డ్యాన్స్ వీడియోలనూ ఆమె పోస్ట్ చేస్తారు. ఇక లేటెస్ట్గా ఆమె ఇటీవల తాజ్ మహల్ను పేరెంట్స్తో కలిసి సందర్శించినప్పటి ఫొటోలు, వీడియోలను జివోన్ ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. పింక్ సల్వార్ సూట్ ధరించిన జివోన్ వారి పేరెంట్స్తో కలసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
బ్యాక్డ్రాప్లో చారిత్రకు తాజ్ మహల్ను ఈ వైరల్ క్లిప్లో చూడొచ్చు. కొరియన్ తల్లితండ్రులకు భారతీయ బాలిక..ఈరోజు మా పేరెంట్స్కు తాజ్ మహల్ చూపించాను. తాజ్ మహల్తో వారు ప్రేమలో పడ్డారని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్ట్కు నెటిజన్లు ఫిదా కాగా, కామెంట్స్ సెక్షన్లో లవ్, హార్ట్ ఎమోజీలతో హోరెత్తించారు.
Read More
Indian Idol Season-2 | తెలుగు ఇండియన్ ఐడల్-2 విజేతగా సౌజన్య.. ప్రైజ్మనీ ఎంతంటే?