కేరళ సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా కొడియేరి బాలకృష్ణన్ తిరిగి ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ పొలిట్బ్యూరో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. అనారోగ్య కారణాల రీత్యా ఆయన పార్టీ బాధ్యతల నుంచి గతంలో తప్పుకున్నారు. అయితే మనీ లాండరింగ్ కేసులో ఆయన కుమారుడు వినీశ్ కొడియేరి అరెస్టైన నేపథ్యంలోనే ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారని వార్తలొచ్చాయి.
దీంతో తాత్కాలిక కార్యదర్శిగా ఎల్టీఎఫ్ కన్వీనర్ విజయరాఘవన్ను నియమించింది. అయితే.. కొడియేరి బాలకృష్ణన్ కుమారుడు బెయిల్పై విడుదల కావడంతో బాలకృష్ణన్కు పార్టీ తిరిగి కార్యదర్శిగా నియమించింది. మరో మూడు సంవత్సరాల పాటు బాలకృష్ణన్ ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈయనకు పార్టీ పగ్గాలు అప్పజెప్పడాన్ని కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా స్వాగతించారు.