చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రచారం జోరుగా సాగుతున్నది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు తెగ తంటాలు పడుతున్నారు. బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఇవాళ థౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజవకర్గంలో ప్రచారం చేశారు. ఇంటింట ప్రచారం నిర్వహించిన ఆమె.. ఓ హోటల్ వద్ద దోశ వేశారు. ఇక కోయంబత్తూరులో ప్రచారం నిర్వహించేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెళ్లారు. అక్కడ ఆమె బీజేపీ కార్యకర్తలతో దాండియా ఆడారు. కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి వనతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. ఇక ఓ స్వతంత్య్ర అభ్యర్థి చెపాక్లో వెరైటీ క్యాంపేన్ చేశారు. పట్టాలీ మక్కల్ కచ్చి పార్టీ అభ్యర్థి ఏవీఏ కాసాలికి మామిడి పండ్ల గుర్తును కేటాయించారు. ట్రిప్లికేన్ మార్కెట్లో ప్రచారం నిర్వహించిన కాసాలి .. తనకు కేటాయించిన మామిడ పండ్లను అమ్మారు. చెపాక్లో డీఎంకే నేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్నారు.
#WATCH Coimbatore: Union Minister Smriti Irani performs traditional dance* with BJP workers, as a part of election campaigning for Vanathi Srinivasan, the party's candidate from Coimbatore South constituency.#TamilNaduElections pic.twitter.com/1S6zQF2RgL
— ANI (@ANI) March 27, 2021