న్యూఢిల్లీ : తమిళనాడు మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఈడీ (Senthil Balaji) అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. సెంథిల్ అరెస్ట్ను ఖండించిన ఖర్గే కాషాయ పాలకులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తమను వ్యతిరేకించేవారిపై మోదీ సర్కార్ రాజకీయ వేధింపులకు పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలను చేపడుతున్నదని ఆరోపించారు.
విపక్ష నేతలెవరినీ ఇలా అణిచివేతకు పాల్పడటం సరైంది కాదని దుయ్యబట్టారు. ఈడీ అధికారులు బుధవారం ఉదయం మంత్రిని అరెస్ట్ చేసి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా తనకు ఛాతీలో నొప్పిగా ఉందన్న మంత్రి భావోద్వేగానికి గురయ్యారు.
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. మంత్రి అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన విపక్షాలు డీఎంకేకు బాసటగా నిలిచాయి. ఇక మనీల్యాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రికి ఈనెల 28 వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించారు.
Read More
Senthil Balaji | మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రికి జూన్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ