న్యూఢిల్లీ, జూన్ 15: సిక్కు వేర్పాటువాద సంస్థ ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్కు అత్యంత సన్నిహితుడు, ఖలిస్థాన్ నేత అవతార్ సింగ్ ఖండా గురువారం యూకేలో మరణించారు. ఖండా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని, పరిస్థితి విషమించడంతో బర్మింగ్హామ్లోని ఓ దవాఖానలో చేర్పించారని పలు వార్తాసంస్థలు పేర్కొన్నాయి.
గతంలో లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు జరిగిన హింసాత్మక ఆందోళనల వెనుక అవతార్ సింగ్ ఉన్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. ప్రస్తుతం యూకే కేంద్రంగా నడిచే ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్(కేఎల్ఎఫ్) అధ్యక్షుడిగా అవతార్ సింగ్ ఖండా కొనసాగుతున్నారు. యూకేలో రాజకీయ శరణార్థిగా ఉన్న ఖండా.. సిక్కు యువకులను వేర్పాటువాద ఉద్యమం వైపు ఆకర్షించడంలో కీలకంగా ఉన్నారు.