అమృత్సర్: ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగి 37 ఏళ్లు అయిన సందర్భంగా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో మరోసారి ఖలిస్తానీ జెండాలు కనిపించాయి. అంతేకాదు ఖలిస్తానీ ఉగ్రవాది జర్నైల్ భింద్రన్వాలే పోస్టర్లు కూడా కనిపించడం గమనార్హం. వందలాది మంది గోల్డెన్ టెంపుల్లో జరిగిన కార్యక్రమానికి హాజరై ఖలిస్తానీ జెండాలతో నినాదాలు చేశారు. జర్నైల్ భింద్రన్వాలె సిక్కుల వర్గమైన దమ్దమీ తక్సల్ చీఫ్.
ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో అతనితోపాటు అనుచరులను కూడా ఇండియన్ ఆర్మీ కాల్చి చంపింది. 1984, జూన్ 1 నుంచి 8 మధ్య ఇండియన్ ఆర్మీ ఈ ఆపరేషన్ బ్లూస్టార్ చేపట్టింది. ప్రత్యేక ఖలిస్తాన్ డిమాండ్ చేస్తూ గోల్డెన్ టెంపుల్లో తలదాచుకున్న సిక్కు ఉగ్రవాదులను ఏరివేయాలని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆర్మీని ఆదేశించారు. దానికే ఆపరేషన్ బ్లూస్టార్ అనే పేరు పెట్టారు.