Poonch terror attack | న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని పూంచ్లో మూడు రోజుల క్రితం ఆర్మీ ట్రక్పై జరిగిన ఉగ్రదాడిపై కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదులు దాడికి వినియోగించిన 30కి పైగా 7.62 ఎంఎం స్టీల్ కోర్ తూటాలను ఘటనాస్థలిలో అధికారులు గుర్తించారు. ఇవి చైనాలో తయారైనవని తెలిపారు.
ఆర్మీ ట్రక్పై దాడికి ఉగ్రవాదులు స్టికీ బాంబ్తో పాటు 36 స్టీల్ బుల్లెట్లను వినియోగించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఘటనా స్థలిలో కిరోసిన్ ఆవిరిని కూడా గుర్తించినట్టు తెలిపాయి. జైషే మహమ్మద్, లష్కరే తాయిబా కలిసి ఈ ఉగ్రదాడి ఘాతుకానికి పాల్పడ్డట్టు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.