తిరువనంతపురం : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. 26 మంది విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ దారుణ ఘటన కేరళలోని ఓ పాఠశాలలో వెలుగు చూసింది.
కేరళ జిల్లాలోని ఓ ఎయిడెడ్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు(52) విద్యార్థినులపై కన్నేశాడు. 2021, నవంబర్లో పాఠశాలలు తిరిగి తెరిచిన తర్వాత.. ఆ టీచర్ విద్యార్థినులను టార్గెట్ చేశాడు. 26 మంది విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేశాడు. విద్యార్థినులు తమకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేకపోయారు. ఇటీవల ఓ అమ్మాయి తనకు జరిగిన అవమానాన్ని మరో టీచర్కు చెప్పింది. ఆ టీచర్ చైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు.
చైల్డ్ లైన్ అధికారులు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఆ కీచక టీచర్పై 21 కేసులు నమోదు అయ్యాయి. అతన్ని అరెస్టు చేసి జ్యూడిషీయల్ కస్టడీకి తరలించారు. విద్యార్థినులను వేధించిన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.