తిరువనంతపురం: కేరళలో రోజువారీ కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. గత నెల రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 9,931 కరోనా కేసులు, 58 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 31,70,868కు, మొత్తం మరణాల సంఖ్య 15,408కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 13,206 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 30,33,258కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,21,708 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది.