తిరువనంతపురం: కేరళలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నది. రోజువారీ కరోనా మరణాలు వందకుపైగా ఉండటం ఆందోన రేపుతున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 8,063 కరోనా కేసులు, 110 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,96,957కు, మొత్తం మరణాల సంఖ్య 12,989కు పెరిగింది. కేరళలో గత 24 గంటల్లో 11,529 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 27,87,496కు చేరిందని పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 96,012 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.