తిరువనంతపురం: దేశాన్ని గత నెల రోజులుగా గడగడలాడించిన కరోనా మహమ్మారి క్రమంగా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. అయితే, కేరళలో మాత్రం కరోనా వైరస్ ఉధృతి ఇంకా పూర్తిగా తగ్గలేదు. ప్రతిరోజూ 25 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కూడా కేరళలో 28,798 కొత్త కేసులు నమోదయ్యాయి.
అయితే, కరోనా బారి నుంచి కోలుకుంటున్న వారికంటే కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరిగిపోతున్నది. ప్రస్తుతం కేరళలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 2,48,526కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 151 మంది కరోనా బాధితులు మృతిచెందడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,882కు పెరిగింది.