తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Covid in Kerala ) విస్తృతి కొనసాగుతున్నది. గత రెండుమూడు రోజుల నుంచి తగ్గినట్టే తగ్గిన కొత్త కేసుల సంఖ్య ఇవాళ మళ్లీ పెరిగింది. ఇవాళ కొత్తగా 23,260 మందికి పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా 20,388 మంది కరోనా బాధితులు రికవరీ అయ్యారు. దాంతో కేరళలో మొత్తం రికవరీల సంఖ్య 42,56,697కు పెరిగింది. ఇవాళ కొత్తగా 131 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 23,296కు పెరిగింది.
ఇక, కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల నుంచి మరణాలు, రికవరీలు పోను మరో 1,88,926 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మొత్తం 1,28,817 మంది నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించగా 23,260 మందికి పాజిటివ్ వచ్చిందని కేరళ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.