తిరువనంతపురం: కేరళలో చాలాకాలం తర్వాత మంగళవారం రోజు 10 వేల దిగువకు వచ్చిన రోజువారీ కరోనా ( Corona in Kerala ) కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,616 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 47,51,434కు చేరింది. గత 24 గంటల్లో కరోనా మరణాలు కూడా 100 దాటాయి. మొత్తం 134 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,811కు పెరిగింది.
ఇక గడిచిన 24 గంటల్లో కరోనా రికవరీలు కూడా భారీగానే నమోదయ్యాయి. మొత్తం 14,516 మంది కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 46,02,600కు చేరింది. ప్రస్తుతం కరోనా మరణాలు, రికవరీలు పోను రాష్ట్రంలో 1,22,407 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ మొత్తం 98,782 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.