తిరువనంతపురం: దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, పరిశోధన కేంద్రాన్ని కేరళ పోలీసులు ఏర్పాటు చేశారు. సీఎం విజయన్ శుక్రవారం దీనికి ప్రారంభిస్తారని తిరువనంతపురం ఏడీజీసీ మనోజ్ అబ్రహం తెలిపారు. డ్రోన్ వినియోగంతోపాటు ముప్పు అంశాలను ఈ ల్యాబ్ కమ్ రీసెర్చ్ సెంటర్ పరిశీలిస్తుందని చెప్పారు. పరిశోధనా కేంద్రంలో ఒక డ్రోన్ను విశ్లేషిస్తున్నప్పుడు దాని మూలాన్ని, దేని కోసం వినియోగిస్తున్నారు, పోలీసింగ్ కోసమా, డ్రోన్ నిరోధక యంత్రాంగమా లేదా సరిహద్దులో మాదిరిగా దుర్వినియోగం కోసమా అన్నది తనిఖీ చేస్తామని వివరించారు. దేశంలోనే తొలి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్, పరిశోధన కేంద్రాన్ని ప్రజా భాగస్వామ్యం కార్యక్రమం కింద ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.