కొచ్చి: కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచేలా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు నమోదయ్యాయి. జెహోవా విట్నెసెస్ ప్రార్థనలు జరుగుతున్న ప్రదేశంలో ఇటీవల బాంబు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ రాష్ట్రంలో సంఘవిద్రోహ శక్తులు రెచ్చిపోతుంటే విజయన్ సర్కారు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు.
బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ఇంటర్నెట్లో చూసి బాంబుల తయారీ నేర్చుకున్నట్టు తెలిపాడు. ఈ బాంబుల తయారీకి కేవలం మూడు వేల రూపాయలు మాత్ర మే వెచ్చించినట్టు 48 ఏండ్ల డామినిక్ మార్టిన్ చెప్పాడు.