తిరువనంతపురం: కేరళ ముస్లిం మహిళలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఇరాన్ ఉద్యమానికి సంఘీభావంగా హిజాబ్లను దహనం చేశారు. భారత్లో ముస్లిం మహిళలు ఇలా చేయడం ఇదే తొలిసారి. బహిరంగ ప్రదేశంలో హిజాబ్ ధరించనందుకు ఇరాన్ పోలీసుల చిత్రహింసల్లో ఆ దేశానికి చెందిన పలువురు యువతులు మరణించారు. ఈ నేపథ్యంలో ఇరాన్తోపాటు పలు దేశాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
కాగా, ఇరాన్ ముస్లిం మహిళలకు సంఘీభావంగా కేరళలోని కోజికోడ్లో ఆదివారం ఒక కార్యక్రమం జరిగింది. కేరళ యుక్తివాది సంఘం నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా కొందరు ముస్లిం మహిళలు హిజాబ్లను దహనం చేశారు. ఇరాన్ మహిళలకు మద్దతుగా ఫ్లకార్డులను ప్రదర్శించారు. వారికి సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. దేశంలో తొలిసారి జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Young Muslim Women Burn Hijabs In Kerala, Protest In Solidarity With Iran Anti-Hijab Movement#TNShorts pic.twitter.com/9ZMVZpW5gY
— TIMES NOW (@TimesNow) November 7, 2022
Kerala | A protest burning hijab was staged in Kozhikode on November 6th, in solidarity with the anti-hijab movement in Iran. pic.twitter.com/vVGaq6UEsG
— ANI (@ANI) November 7, 2022