తిరువనంతపురం, నవంబర్ 10: గవర్నర్తో విభేదాలు తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో కేరళ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. కేరళ కళామండలం డీమ్డ్ యూనివర్సిటీ చాన్స్లర్గా గవర్నర్ను తొలగిస్తూ నిబంధనలు మార్చింది. ఆ స్థానంలో కళ, సంస్కృతి రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తిని నియమించనున్నది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల చాన్స్లర్గా గవర్నర్ను తొలగించేందుకు ఆర్డినెన్స్ తేనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం తెలుపకుంటే డిసెంబర్లో ప్రభుత్వమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి దానిపై చట్టం చేస్తుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు గురువారం ప్రకటించారు.