కేరళ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఆదివారం కస్టడీలోకి తీసుకున్నారు. అనంతపురీలో జరిగిన ఓ హిందూ మహా సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రెస్టారెంట్లలో ఏమీ తీసుకోవద్దు. హిందువులను నపుంసకులుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇతర మతాల వారి కోసం అనుమానాస్పదంగా కొన్ని గుర్తులు వేస్తున్నారు. ఇతర మతాల వారిని నపుంసకులుగా మార్చి, తమ బలాన్ని పెంచుకోవాలని ముస్లింలు చూస్తున్నారు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పీసీ జార్జ్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేగాయి. దీంతో శనివారం ఆయనపై కేసు కూడా నమోదైంది. మతపరమైన ఉద్రికత్తలు పెంచే విధంగా ఆయన మాటలు ఉన్నాయంటూ మండిపడ్డారు. దీంతో ఆయన్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనపై 153-ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.