CSpace : దేశంలో ప్రభుత్వ సారధ్యంలోని తొలి ఓటీటీ ప్లాట్ఫాం సీస్పేస్ (CSpace)ను కేరళ సీఎం పినరయి విజయన్ గురువారం ప్రారంభించారు. దేశంలో తొలి ప్రభుత్వ ఓటీటీ ప్లాట్ఫాంగా ముందుకొచ్చిన సీస్పేస్ కంటెట్ ఎంపిక, పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా డిజైన్ చేయబడింది.
కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (కేఎస్ఎఫ్డీసీ) సీస్పేస్ ప్లాట్ఫాంను డెవలప్ చేసింది. కేరళ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహకారంతో ఓటీటీ ప్లాట్ఫాం సీస్పేస్ కార్యకలాపాలు సాగుతాయి. సీస్పేస్ పే ఫర్ వ్యూ మోడల్పై సినిమాకు యూజర్ల నుంచి రూ. 75 వసూలు చేస్తుంది.
బెన్యమిన్, ఓవీ ఉష, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటిసాంస్కృతిక రంగంలో ప్రముఖులైన 60 మంది క్యూరేటర్ల ప్యానెల్ మార్గనిర్ధేశకత్వంలో సీస్పేస్ కార్యకలాపాలు కొనసాగుతాయి.
Read More :
Professor Saibaba: నాగపూర్ జైలు నుంచి రిలీజైన ప్రొఫెసర్ సాయిబాబ