కొచ్చి, మే 31: ఓ లెస్బియన్ జంటను కేరళ హైకోర్టు తిరిగి కలిపింది. అధిలా నస్రీన్, ఫాతిమా నూర అనే మహిళలు పెండ్లి చేసుకుని జీవనం సాగిస్తున్నారు.
వారి తల్లిదండ్రులకు ఇది నచ్చకపోవడంతో విడదీసి వేరుగా ఉంచారు. దీన్ని సవాల్ చేస్తూ అధిలా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు.. వారిద్దరూ కలిసే జీవించాలని తీర్పు ఇచ్చింది.