ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఇవాళ కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ దర్శించుకున్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని ఆయన మహాదేవుడిని కోరుకున్నారు. ఆలయ దర్శనం కోసం వచ్చిన గవర్నర్ ఆరిఫ్కు పూజారులు స్వాగతం పలికారు. నందిహాల్ కాంప్లెక్స్లో ఉన్న బారికేడ్ల నుంచి గవర్నర్ ఆరిఫ్ మహాకాలుడి దర్శనం చేసుకున్నారు. కరోనా వల్ల దర్శన సమయాన్ని కుదించినట్లు పూజారులు గవర్నర్కు వెల్లడించారు. గర్భగుడిలోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు పూజారులు చెప్పారు. ప్రధాని మోదీకి దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుతూ ఉజ్జయిని ఆలయాన్ని ఆ పార్టీ నేతలు సందర్శిస్తున్నారు.