తిరువనంతపురం: కేరళ అసెంబ్లీలో ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ కేవలం 2 నిమిషాల్లోపే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రభుత్వం అందించిన కాపీలో కేవలం చివరి పేరాను చదివి మమ అనిపించారు. ప్రభుత్వ విధానాలపై గవర్నర్ అత్యంత తక్కువ సమయంలో ప్రసంగాన్ని ముగించటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, గత కొంతకాలంగా బిల్లుల ఆమోదం విషయంలో ఎల్డీఎఫ్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం, గవర్నర్ మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.
సభను అపహాస్యం చేశారు
రెండు నిమిషాల్లోపే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించటాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తీవ్రంగా ఆక్షేపించింది. సభను గవర్నర్ అపహాస్యం చేశారని మండిపడింది.