తిరువనంతపురం, ఆగస్టు 9: కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఒక ప్రైవేట్ కంపెనీ రూ.1.7 కోట్లు చెల్లించటంపై న్యాయ విచారణ జరపాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కుమార్తె వీణాకు చెందిన ‘ఎక్సాలజిక్ సొల్యూషన్స్’ కంపెనీతో ‘కొచ్చిన్ మినరల్స్ రూటైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) 2017లో ఒప్పందం చేసుకుంది.
ఎలాంటి సేవలు అందించకుండానే వీణా, ఆమె కంపెనీకి ప్రతినెలా రూ.5లక్షలు చెల్లించటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. నగదు లావాదేవీలపై ఐటీ శాఖ విచారణ చేపట్టడంతో ఈ అంశం రాజకీయంగా సంచలనంగా మారింది.