తిరువనంతపురం, డిసెంబర్ 21: కేరళ సీఎం పినరాయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మధ్య మాటలు తూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా ఆరిఫ్పై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీకి విజయన్ ఫిర్యాదు చేశారు.
గవర్నర్ తన రాజ్యాంగ విధులను సరిగా నిర్వర్తించడం లేదని, ప్రొటోకాల్ను ఉల్లంఘిస్తున్నారని పేర్కొంటూ లేఖ రాశారు. ఆయన ప్రవర్తన కూడా గవర్నర్ హోదాకు తగ్గట్టు లేదని తెలిపారు. దీనిపై ఓ సారి దృష్టి సారించాలని కోరారు.