తిరువనంతపురం: ఢిల్లీలోని జహంగీర్పురిలో నిందితుల ఇండ్లు, షాపుల కూల్చివేతపై కేంద్ర ప్రభుత్వం మీద కేరళ సీఎం విజయన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు వచ్చిన 101వ ర్యాంకు ను కూడా ఇలాగే బుల్డోజర్లతో చెరిపేస్తారా అని ఎద్దేవా చేశారు.
బ్రిటన్ ప్రధాని పర్యటన నేపథ్యంలో గుజరాత్లోని మురికివాడలను కర్టెన్లతో కవర్ చేయడాన్ని విమర్శించారు. విద్వేషాలు వ్యాప్తి చేస్తే ఈ సమస్యలు పరిష్కారమవుతాయా అని ప్రశ్నించారు.