పతనంతిట్ట, డిసెంబర్ 17: గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే ప్రకటనలతో రాష్ట్రంలో శాంతిని ధ్వంసం చేస్తున్నారని కేరళ సీఎం పినరాయి విజయన్ విమర్శించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థులను క్రిమినల్స్ అని గవర్నర్ విమర్శించడాన్ని ఖండించారు. ఖాన్ తాను గవర్నర్ను అన్న మాట మరిచి ఏది పడితే అది మాట్లాడుతున్నారని, తన చర్యలతో రాష్ట్రంలోని శాంతికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులను క్రిమినల్స్, గూండాలు అని పేర్కొనడం ఎంతవరకు సబబని విజయన్ ప్రశ్నించారు.