Sabarimala | అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే పిల్లలకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి కాదని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అయితే, వారి వద్ద శానిటైజర్లు, సబ్బులు ఉండేలా వారి పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఇతరుల మధ్య భౌతిక దూరం పాటించాలని తాజా ఆదేశాల్లో వెల్లడించింది.
మకర విలక్కు సందర్భంగా ఈ నెల 16 నుంచి మొదలైన శబరిమల యాత్రలో పాల్గొనే భక్తులు, సిబ్బంది తప్పనిసరిగా రెండు డోస్లు వేసుకోవాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. లేని పక్షంలో భక్తులు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని స్పష్టం చేసింది. భారీగా కురుస్తున్న వర్షాలు.. కరోనా నేపథ్యంలో భక్తులను వర్చువల్ క్యూ పద్దతిలో ఆలయ సందర్శనకు అనుమతి ఇస్తున్నారు.