తిరువనంతపురం: రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటోలు కలిగిన సైన్ బోర్డులు, ఫ్లెక్స్-బ్యానర్లు ఉంచాలన్న కేంద్రం మార్గదర్శకాలను అమలు చేయలేమని కేరళ సర్కారు తేల్చి చెప్పింది. సోమవారం అసెంబ్లీలో ఒక ప్రశ్నకు ఆ రాష్ట్ర సీఎం విజయన్ ఈ విధంగా స్పందించారు. ‘లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి ప్రచారం చేయమనడం వారి(బీజేపీ) ఎన్నికల ప్రచారంలో భాగమే. దీనిపై మేం కేంద్రాన్ని ప్రశ్నిస్తాం. ఎన్నికల సంఘాన్ని సంప్రదించే ఆలోచన చేస్తాం’ అని విజయన్ అన్నారు.